Skip to main content

Mekapati Goutham Reddy: రాష్ట్రంలోని ఏ నగరంలో వాణిజ్య ఉత్సవ్‌–2021 జరగనుంది?

Mekapati

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వాణిజ్య ఎగుమతుల రెట్టింపే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర వాణిజ్యశాఖతో కలిసి రాష్ట్రంలో ‘వాణిజ్య ఉత్సవ్‌–2021’ పేరిట సెప్టెంబర్‌ 21, 22 తేదీల్లో విజయవాడలో భారీ వాణిజ్య సదస్సు నిర్వహించనుంది. ఈ విషయాన్ని సెప్టెంబర్‌ 16న రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెప్పారు.

రెండో ఐటీ పాలసీ ఆవిష్కరణ

డిజిటల్‌ ప్రపంచానికి పెరుగుతున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని అన్ని సామాజిక నేపథ్యాల ప్రజలు సాధికారత సాధించేలా రెండో ‘ఇన్ఫర్మేషన్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ (ఐసీటీ)’పాలసీకి రూపకల్పన చేశామని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి తారకరామారావు తెలిపారు. 2021 నుంచి 2026 వరకు అమలు చేసే ఈ రెండో ఐసీటీ పాలసీని సెప్టెంబర్‌ 16న హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. వచ్చే ఐదేళ్లలో ఐటీ, ఐటీ ఆధారిత రంగాల్లో రూ.3లక్షల కోట్ల వార్షిక ఎగుమతులు సాధించాలని.. పది లక్షల మందికి ఉద్యోగాల కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు.

చ‌ద‌వండి: స్టాచ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?


క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : సెప్టెంబర్‌ 21, 22 తేదీల్లో వాణిజ్య ఉత్సవ్‌–2021 పేరిట భారీ వాణిజ్య సదస్సు నిర్వహణ 
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 16
ఎవరు    : తెలంగాణ పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి
ఎక్కడ    : విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు  : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వాణిజ్య ఎగుమతుల రెట్టింపే లక్ష్యంగా...

 

Published date : 18 Sep 2021 05:42PM

Photo Stories