Skip to main content

Statue of Equality: భగవద్రామానుజుల విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?

Ramnath kovind and Chinna Jeeyar

2021, ఫిబ్రవరిలో హైదరాబాద్‌ సమీపంలోని ముచ్చింతల్‌లో జరగబోయే 216 అడుగుల భగవద్రామానుజుల విగ్రహం (స్టాచ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ) ఆవిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడులకు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌ స్వామి ఆహ్వానాన్ని అందజేశారు. సెప్టెంబర్‌ 14న రాష్ట్రపతిభవన్‌లో కోవింద్‌ను కలిసిన ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకావాలని కోరారు.

రూ.వెయ్యి కోట్ల అంచనాతో...

శ్రీ భగవద్రామానుజుల సహస్రాబ్దిని పురష్కరించుకుని సమతామూర్తి రామానుజుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 1,100 టన్నుల బరువు ఉండే 216 అడుగుల పంచలోహ విగ్రహంతోపాటు దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.వెయ్యి కోట్ల అంచనాతో స్ఫూర్తి కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. 2014లో ఈ పనులకు చినజీయర్‌ స్వామి భూమిపూజ చేశారు. నిత్యం పూజలు అందుకునేవిధంగా 120 కిలోల బంగారంతో మరో విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు 2022, ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

చ‌ద‌వండి: ఏపీ హెచ్‌ఆర్‌సీ కార్యాలయం ఏ నగరంలో ఏర్పాటైంది?


క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడులకు ఆహ్వాన పత్రికలు అందజేత... 
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 14
ఎవరు    : త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌ స్వామి
ఎక్కడ    : ముచ్చింతల్, శంషాబాద్‌ మండలం, రంగారెడ్డి జిల్లా
ఎందుకు  : భగవద్రామానుజుల విగ్రహం (స్టాచ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ) ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాలని...

 

Published date : 15 Sep 2021 05:25PM

Photo Stories