Skip to main content

Supreme Court Collegium: ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టు సీజేగా ఎవరు ఉన్నారు?

AP High Court

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురు న్యాయవాదుల పేర్లను సిఫారసు చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన తీర్మానానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఫిబ్రవరి 10న ఆమోద ముద్ర వేశారు. కొనకంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, తర్లాడ రాజశేఖరరావు, సత్తి సుబ్బారెడ్డి, చీమలపాటి రవి, వడ్డిబోయన సుజాతలను న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. వీరి వీరి చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా ప్రమాణం చేయించనున్నారు. వీరి  నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 27కి చేరనుంది.

ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు..

తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసి అదే రోజు అక్కడి నుంచి పరిపాలన, కలెక్టర్లు, ఎస్పీల కార్యకలాపాలు కొనసాగాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని ఫిబ్రవరి 10న అధికార యంత్రాంగానికి నిర్దేశించారు.

చ‌ద‌వండి: రాష్ట్రంలోని ఏ నగరంలో అంబేడ్కర్‌ స్మృతివనం ఏర్పాటు చేయనున్నారు?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 11 Feb 2022 04:45PM

Photo Stories