Skip to main content

RBI Regional Office: విశాఖలో ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయం

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తన ప్రాంతీయ కార్యాలయాన్ని విశా­ఖ­­పట్నంలో ఏర్పాటు చేయ‌నుంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపా­లన్నీ హైదరా­బాద్‌­లోని రిజర్వ్‌ బ్యాంక్‌ కార్యాల­యం నుంచే కొనసాగించింది. రాష్ట్ర విభజన అనంతరం కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు సంబంధించిన లావా­దేవీలన్నీ అక్కడి నుంచే జరుగుతు­న్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక శాఖ నిర్వహించే సమావేశా­లకు హైదరాబాద్‌ నుంచే అధికారులు విజయవా­డకు వస్తున్నారు. దీనివల్ల పరిపాలన సౌలభ్యం కష్టసాధ్యమవుతుందని.. రాష్ట్రంలోనే ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఆర్‌­బీఐ ఉన్నతా­ధికారులు నిర్ణయించారు.
ఈ క్రమం­లో విశాఖ­లో ఆర్‌బీఐ బృందం ఇటీవల పర్యటించిం­ది. జిల్లా అధికారులతో చర్చించి పలు భవ­నాలను పరిశీలించింది. 500 మంది ఉద్యో­గులతో ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు వేగవంతం చేసింది.  ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు దాదాపు 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న భవనం అవసరమని ఆర్‌బీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ బృందం జిల్లా కలెక్టర్‌ డా.మల్లికార్జునతో సంప్రదింపులు జరి­పింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో మధురవాడ, రుషికొండ, ఆరి­లోవ, కొమ్మాది, భీమిలి, హనుమంతువాక, కైలాసగిరి, సాగర్‌నగర్‌ పరిధిలోని పలు భవ­నాల్ని పరిశీలించారు. 

Granules Investments: ఏపీలో రూ.2,000 కోట్లతో గ్రాన్యూల్స్‌ ప్లాంట్‌

Published date : 07 Feb 2023 11:22AM

Photo Stories