Skip to main content

Millets: మిల్లెట్స్‌ మిషన్‌ను ప్రారంభించనున్న రాష్ట్ర ప్రభుత్వం?

Millets

చిరుధాన్యాల సాగును రెట్టింపు చేయడమే లక్ష్యంగా ‘మిల్లెట్స్‌ మిషన్‌’కు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చట్టనుంది. ఈ మేరకు కార్యాచరణ రూపొందిస్తోంది. సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా చిరుధాన్యాల సాగును ప్రోత్సహించి సరికొత్త వ్యవసాయ విప్లవం దిశగా కార్యాచరణ చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏటా 5.79 లక్షల ఎకరాల్లో చిరు ధాన్యాలను పండిస్తున్నారు. మేజర్‌ మిల్లెట్స్‌గా పరిగణించే సజ్జలు, జొన్నలు, మైనర్‌ మిల్లెట్స్‌గా పరిగణించే రాగులు, కొర్రలు, వరిగ, ఊద, సామలు, అరిక పంటలను సాగు చేయడం ద్వారా ఏటా 4.40 లక్షల టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. రానున్న ఐదేళ్లలో చిరు ధాన్యాల సాగు విస్తీర్ణాన్ని అదనంగా మరో 5 లక్షల ఎకరాలు పెంచనున్నారు.

Telangana: ప్రాణహిత నది మొత్తం పొడవు ఎన్ని కిలోమీటర్లు?

రాష్టంలోని ఏ జిల్లాలో డీవీ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఏర్పాటు కానుంది?
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం కొత్తపల్లె పంచాయతీ కొటార్లపల్లె వద్ద స్మార్ట్‌ డీవీ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఏర్పాటు కానుంది. రూ.50 కోట్లతో ఏర్పాటు కానున్న ఈ కంపెనీకి ఏప్రిల్‌ 14న ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కె.నారాయణస్వామి భూమి పూజ చేశారు.

Invest India: ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
మిల్లెట్స్‌ మిషన్‌ను ప్రారంభించనున్న రాష్ట్ర ప్రభుత్వం?
ఎప్పుడు : ఏప్రిల్‌ 14
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం  
ఎక్కడ    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా..
ఎందుకు : రాష్ట్రంలో చిరుధాన్యాల సాగును రెట్టింపు చేయడమే లక్ష్యంగా..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 15 Apr 2022 04:59PM

Photo Stories