Skip to main content

Dubai Expo 2020: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో ఒప్పందం అమెరికా సంస్థ?

AP Logo

దుబాయ్‌ ఎక్స్‌పో–2020లో పెట్టుబడులను ఆకర్షిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 17న మరో రెండు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. అల్యూమినియం కాంపోజిట్‌ ప్యానల్స్‌ను తయారుచేసే అమెరికాకు చెందిన అలుబాండ్‌ గ్లోబల్‌ సంస్థ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. రూ.1,500 కోట్ల పెట్టుబడితో అల్యూమినియం కాయిల్స్, ప్యానల్‌ తయారీ యూనిట్‌ను ఈ సంస్థ ఏర్పాటుచేయనుంది. దుబాయ్‌ ఎక్స్‌పోలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సమక్షంలో ఈ ఒప్పంద కార్యక్రమం జరిగింది.

షరాఫ్‌ గ్రూపు కూడా..
షిప్పింగ్, లాజిస్టిక్, సప్లై చైన్‌ రంగాల్లో విస్తరించి ఉన్న షరాఫ్‌ గ్రూపు(యూఏఈకి చెందిన çసంస్థ) కూడా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పోర్టు ఆథారిత సేవల రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. రూ.500 కోట్ల పెట్టుబడితో రెండు లాజిస్టిక్‌ పార్కులను అభివృద్ధి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో గిడ్డంగులు, ప్యాకింగ్‌ యూనిట్లు, డిస్‌ప్లే యూనిట్లు, సరుకు రవాణాకు తగిన రైల్‌ సైడింగ్‌ వంటి సౌకర్యాలతో ఈ లాజిస్టిక్‌ పార్కులను అభివృద్ధి చేయనుంది.

చ‌ద‌వండి: ఆసియా ఖండంలో అతిపెద్ద ఆదివాసీ జాతర ఏది?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
దుబాయ్‌ ఎక్స్‌పో–2020లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో వేర్వేరుగా ఒప్పందం చేసుకున్న సంస్థలు?
ఎప్పుడు : ఫిబ్రవరి 17
ఎవరు    : అలుబాండ్‌ గ్లోబల్‌ సంస్థ, షరాఫ్‌ గ్రూపు 
ఎందుకు : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 18 Feb 2022 04:43PM

Photo Stories