Skip to main content

Telemedicine: టెలీమెడిసిన్‌ సేవల్లో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?

Telemedicine

టెలీమెడిసిన్‌ సేవల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లను హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లుగా మార్చడంలో, వాటి నిర్వహణలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై ప్రశంసలు కురిపించింది. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ మన్షుక్‌ మాండవీయ వర్చువల్‌ విధానంలో ఏప్రిల్‌ 16న రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 2022 ఏడాది ఆఖరు నాటికి హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్‌లుగా మార్చాలని కేంద్రం రాష్ట్రాలకు లక్ష్యం నిర్దేశించింది.

Millets: మిల్లెట్స్‌ మిషన్‌ను ప్రారంభించనున్న రాష్ట్ర ప్రభుత్వం?

రెండో స్థానంలో కర్ణాటక..
కేంద్ర ప్రభుత్వం.. 2019 నవంబర్‌లో దేశవ్యాప్తంగా ఈ–సంజీవని టెలీమెడిసిన్‌ సేవలను ప్రారంభించింది. ఇప్పటివరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 3,30,36,214 కన్సల్టేషన్‌లు నమోదయ్యాయి. వీటిలో 43.01 శాతం అంటే 1,42,11,879 కన్సల్టేషన్‌లు ఆంధ్రప్రదేశ్‌ నుంచే ఉన్నాయి. 47 లక్షల కన్సల్టేషన్‌లతో కర్ణాటక రెండో స్థానంలో, 34 లక్షలతో పశ్చిమ బెంగాల్‌ మూడో స్థానంలో ఉన్నాయి.

Telangana: ప్రాణహిత నది మొత్తం పొడవు ఎన్ని కిలోమీటర్లు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
టెలీమెడిసిన్‌ సేవల్లో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
ఎప్పుడు : ఏప్రిల్‌ 17
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌
ఎక్కడ    : దేశంలో..
ఎందుకు : ఆంధ్రప్రదేశ్‌ నుంచి అత్యధిక కన్సల్టేషన్‌లు నమోదైనందున..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 18 Apr 2022 06:57PM

Photo Stories