Skip to main content

New Mandals : తెలంగాణలో కొత్తగా మరో 13 మండలాలు

రాష్ట్రంలో మరో 13 కొత్త మండలాలు ఏర్పడ్డాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్త ర్వులు జారీ చేసింది. గతంలోనే వీటికి సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ అయింది.
13 new mandals in Telangana
13 new mandals in Telangana

తాజాగా ప్రజల నుంచి అభ్యంతరాలు, వినతులను స్వీకరించిన అనంతరం తెలంగాణ జిల్లాల ఏర్పాటు చట్టం (1974లోని సెక్షన్‌ 3) ప్రకారం ఈ మండలాలను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సెప్టెంబర్ 26న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మండలాలన్నీ సెప్టెంబర్‌ 26, 2022 నుంచి ఉనికిలోకి వస్తాయి. ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఫైనల్‌ గెజిట్‌లో పేర్కొంటున్నట్టు ఆ ఉత్తర్వుల్లో వెల్లడించారు. జగిత్యాల, సంగారెడ్డి, నల్లగొండ, మహబూబాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌ జిల్లాల్లో ఈ కొత్త మండలాలను ఏర్పాటు చేశారు. 

Also read: Telanganaలో కొత్తగా 13 రెవెన్యూ మండలాలు

రాష్ట్రంలో ఇప్పటికే 607 మండలాలు ఉండగా, ఇప్పుడు మరో 13 కొత్తగా ఏర్పాటు కావడంతో రెవెన్యూ మండలాల సంఖ్య 620కి చేరింది. 

కొత్త మండలాలివే..

మండలం గ్రామాల రెవెన్యూ
పేరు సంఖ్య డివిజన్‌
ఎండపల్లి 13 జగిత్యాల
భీమారం 09 కోరుట్ల
నిజాంపేట 09 నారాయణ్‌ఖేడ్‌
గట్టుప్పల 06 నల్లగొండ
డోంగ్లీ 15 బాన్సువాడ
సీరోల్‌ 06 మహబూబాబాద్‌
ఇనుగుర్తి 05 మహబూబాబాద్‌
కౌకుంట్ల 09 మహబూబ్‌నగర్‌
ఆలూరు 07 ఆర్మూరు
డొంకేశ్వర్‌ 12 ఆర్మూరు
సాలూర 10 బోధన్‌
అక్బర్‌పేట– భూంపల్లి 13 సిద్దిపేట
కుకునూర్‌పల్లి 15 గజ్వేల్‌

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 27 Sep 2022 06:09PM

Photo Stories