Ramoji Rao: ఈనాడు అధినేత రామోజీరావు కన్నుమూత
Sakshi Education
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు జూన్ 8వ తేదీ(శనివారం) కన్నుమూశారు.
![Ramoji Film City Founder and media mogul Ramoji Rao Passes Away](/sites/default/files/images/2024/06/08/ramoji-rao-1717826146.jpg)
గుండె సంబంధిత సమస్యలతో కొద్దిరోజులుగా బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
రామోజీ మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకటసుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. ఆయన.. 1962లో మార్గదర్శి చిట్ఫండ్స్ను స్థాపించడం ద్వారా తన వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈనాడు దినపత్రికను 1974 ఆగస్టు 10న విశాఖపట్నంలో ప్రారంభించారు. ఈనాడుతో పాటు ‘సితార’ సినీ పత్రిక నడిపారు. హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయిలో ఫిల్మ్ సిటీని నిర్మించారు. 2016లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మవిభూషణ్తో సత్కరించింది.
Nirab Kumar Prasad: ఏపీ కొత్త సీఎస్గా నీరబ్కుమార్ ప్రసాద్
Published date : 08 Jun 2024 11:25AM