Skip to main content

Oscar Fernandes: మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ ఫెర్నాండెజ్‌ అస్తమయం

కాంగ్రెస్‌ కురువృద్ధుడు, మాజీ కేంద్ర మంత్రి, రాజ్య సభ ఎంపీ ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌(80) కన్నుమూశారు.
Oscar Fernandes

2021, జూలై నెలలో ఆయన నివాసంలో వ్యాయామం చేస్తుండగా కింద పడటంతో తలకు గాయమై మెదడులో రక్తం గడ్డకట్టింది. దీనికి సంబంధించి చికిత్స పొందుతూ సెప్టెంబర్‌ 13న మంగళూరులోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. దాదాపు 50 ఏళ్ల రాజకీయ జీవితం గడిపిన ఫెర్నాండెజ్‌ కర్ణాటకలోని ఉడుపి నియోజకవర్గం నుంచి తొలిసారిగా 1980లో ఎంపీగా గెలిచారు. ఆ తర్వాతా వరసగా నాలుగు సార్లు లోక్‌సభకు ఎన్నియ్యారు. రాజ్యసభకు తొలిసారిగా 1998లో ఎన్నికయ్యారు. ఆ తర్వాత మూడు సార్లు ఎన్నికయ్యారు. 2006 నుంచి 2009 వరకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

చ‌దవండి: బీపీసీఎల్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి?


క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ కన్నుమూత 
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 13
ఎవరు    : ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌(80)
ఎక్కడ    : మంగళూరు, కర్ణాటక
ఎందుకు    : వ్యాయామం చేస్తుండగా కింద పడటంతో తలకు తగిలిన గాయం కారణంగా...

Published date : 14 Sep 2021 01:54PM

Photo Stories