Deputy Speaker: ఆంధ్రప్రదేశ్ నుంచి ప్యానెల్ స్పీకర్గా ఎంపీ కృష్ణప్రసాద్
![MP Krishna Prasad as Deputy Speaker of Lok Sabha](/sites/default/files/images/2024/07/02/loksaba-1719914978.jpg)
ఆరు పార్టీలకు చెందిన తొమ్మిది మంది సభ్యులని నియమిస్తున్నట్లు జులై 1వ తేదీ ప్రకటించారు. ఈ ప్యానెల్ స్పీకర్ల జాబితాలో జగదంబికా పాల్, ఏ రాజా, పీపీ మోహన్, సంధ్యా రాయ్, దిలీప్ సైకియా, శెల్జా, కాకోలీ ఘోష్ దస్తీదార్, అవధేశ్ ప్రసాద్లు ప్యానెల్ స్పీకర్లుగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి తెన్నేటి కృష్ణప్రసాద్కు..
ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్డీఏ కూటమికి చెందిన తెన్నేటి కృష్ణప్రసాద్కు ప్యానెల్లో స్థానం కల్పించారు. 1960లో హైదరాబాద్లో జన్మించిన ఈయన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి. ఆయన తండ్రి సుబ్బయ్య ఐటీఐ ప్రిన్సిపల్, తల్లి విజయలక్ష్మీ స్కూల్ టీచర్. ఎన్ఐటీ వరంగల్ నుంచి బీటెక్ పూర్తి చేసిన ఈయన అహ్మదాబాద్ ఐఐఎం నుంచి ఏంబీఏ చేశారు. 1986 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారిగా పోలీస్ శాఖలో 34ఏళ్ల పాటూ సేవలు అందించారు. విజయవాడ పోలీస్ కమిషనర్గా, వరంగల్, విశాఖ రేంజ్లలో డీఐజీగా చేపట్టారు.
Vikram Misri: విదేశాంగ కార్యదర్శిగా నియమితులైన విక్రం మిశ్రి