Skip to main content

Andhra Pradesh: రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌గా ఎన్నికైన తొలి దళిత వ్యక్తి?

Koyye Moshen Raju

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌గా కొయ్యే మోషేన్‌ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నవంబర్‌ 19న ఆయన అభ్యర్థిత్వాన్ని గంగుల ప్రభాకర్‌ రెడ్డి ప్రతిపాదించగా సభ్యులు దువ్వాడ శ్రీనివాసరావు, బల్లి కల్యాణ చక్రవర్తి బలపర్చారు. రాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు  ప్రొటెం చైర్మన్‌ విఠపు బాలసుబ్రహ్మణ్యం ప్రకటించారు. రాజును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఇతర పార్టీల నేతలు తోడ్కొనివచ్చి చైర్మన్‌ కుర్చీలో కూర్చోబెట్టారు. దీంతో పెద్దల సభగా పిలుచుకునే మండలి చైర్మన్‌గా పదవిని చేపట్టిన తొలి దళిత వ్యక్తిగా రాజు గుర్తింపు పొందారు. ఏపీ శాసనమండలిలో మొత్తం 58 సీట్లు ఉన్నాయి.

చ‌ద‌వండి: హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులు కానున్న తొలి స్వలింగ సంపర్కుడు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌గా ఎన్నికైన తొలి దళిత వ్యక్తి?
ఎప్పుడు : నవంబర్‌ 19
ఎవరు    : కొయ్యే మోషేన్‌ రాజు

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 20 Nov 2021 03:51PM

Photo Stories