Skip to main content

Justice RP Desai Nominated As Chairperson Of Press Council Of India: పీసీఐ చైర్‌పర్సన్‌గా జస్టిస్‌ ఆర్‌పీ దేశాయ్‌

Justice RP Desai Nominated As Chairperson Of Press Council Of India

ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ) తొలి మహిళా చైర్‌ పర్సన్‌గా సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ రంజనా ప్రకాష్‌ దేశాయ్‌(72) నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ జూన్‌  17(శుక్రవారం) గజెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆమె ఎంపికపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, పీసీఐ సభ్యుడు ప్రకాశ్‌ దుబేలతో కూడిన కమిటీ ఆమోదముద్ర వేసింది. 2011–2014 మధ్య ఆమె సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చేశారు.

Published date : 18 Jun 2022 04:37PM

Photo Stories