Skip to main content

Breaking Barriers Book:‘బ్రేకింగ్‌ బారియర్స్‌‘ పుస్తకావిష్కరణ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర తొలి దళిత చీఫ్‌ సెక్రటరీ కె.మాధవరావు ఆటోబయోగ్రఫీ ఆవిష్కరణ నవంబర్‌ 19న హైదరాబాద్‌లో జరిగింది. బ్రేకింగ్‌ బ్యారియర్స్‌ పేరిట ఎమెస్కో ప్రచురించిన ఈ పుస్తకాన్ని ఐఎఎస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ బిల్డింగ్స్‌లో ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ వై.వి.రెడ్డి ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆయనతో కలసి పనిచేసిన పలువురు అధికారులు ప్రసంగించారు. సీపీఎం నేత బీవీ రాఘవులు, ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య, మల్లేపల్లి లక్ష్మయ్య, ప్రముఖ న్యాయవాది చంద్రయ్య, ఎమెస్కో విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. దళితవాడలో పుట్టి.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగిన విశ్రాంత ఐఏఎస్‌ అధికారి కాకి మాధవరావు జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమైందని వక్తలు కొనియాడారు.    

Lance Naik Manju: ఆకాశమే ఆమె సరిహద్దు.. 10 వేల అడుగుల ఎత్తులో..

Published date : 21 Nov 2022 12:00PM

Photo Stories