Skip to main content

Uttarakhand: రాష్ట్ర అసెంబ్లీ తొలి మహిళా స్పీకర్‌గా ఎన్నికైన ఎమ్మెల్యే?

Ritu Khanduri

ఉత్తరాఖండ్‌ రాష్ట్ర అసెంబ్లీ తొలి మహిళా స్పీకర్‌గా మాజీ సీఎం బీసీ ఖండూరీ కుమార్తె, బీజేపీ ఎమ్మెల్యే రీతూ ఖండూరీ భూషణ్‌ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి తదితరులు ఆమెను అభినందించారు. అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలయ్యేలా రీతూ హయాంలోనే తీర్మానం చేసుకోగలమని విపక్ష సభ్యుడు ప్రీతమ్‌ సింగ్‌ అన్నారు. ఇటీవల జరిగిన ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గాను 47 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ.. నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే.

Dun & Bradstreet: డీఅండ్‌బీ సలహా బోర్డులో చేరిన ఎస్‌బీఐ మాజీ చైర్మన్‌?

యూపీ ప్రతిపక్ష నేతగా ఎన్నికైన వ్యక్తి?
ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ ఎన్నికయ్యారు. సమాజ్‌వాదీ శాసనసభాపక్ష నాయకుడిగా అఖిలేశ్‌ యాదవ్‌ను మార్చి 26న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ..  యోగి ఆదిత్యనాథ్‌ ముఖ్యమంత్రిగా నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకుగాను.. 255 చోట్ల బీజేపీ జయకేతనం ఎగరవేసింది. 111 స్థానాల్లో గెలుపొందిన సమాజ్‌వాదీ పార్టీ.. బీజేపీ తర్వాత అత్యధిక సీట్లు గెలిచిన పార్టీగా నిలిచింది.

AIIMS Director: ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌గా ఎవరు ఉన్నారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఉత్తరాఖండ్‌ రాష్ట్ర అసెంబ్లీ తొలి మహిళా స్పీకర్‌గా ఎన్నికైన మహిళ?
ఎప్పుడు : మార్చి 26
ఎవరు    : మాజీ సీఎం బీసీ ఖండూరీ కుమార్తె, బీజేపీ ఎమ్మెల్యే రీతూ ఖండూరీ భూషణ్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 28 Mar 2022 12:58PM

Photo Stories