Skip to main content

Supreme Court: భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Supreme Court verdict on right to freedom of speech

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వారికి ప్రత్యేక ఆంక్షలేమీ విధించలేమని స్పష్టం చేసింది. రాజ్యాంగం ప్రకారం–సాధారణ ప్రజలకు ఉన్న వాక్‌ స్వాతంత్య్రమే ప్రజాప్రతినిధులకు కూడా ఉంటుందని తేల్చిచెప్పింది. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 4–1తో తీర్పును ప్రకటించింది. జస్టిస్‌ నాగరత్న మాత్రం ఈ తీర్పుతో విభేదించారు. మంత్రుల విద్వేషపూరిత వ్యాఖ్యలను నియంత్రించాల్సిన బాధ్యత పార్టీలదే అని పేర్కొన్నారు. నేతల రెచ్చగొట్టే ప్రసంగాలు రాజ్యాంగంలోని సోదర భావం, స్వేచ్చ, సమానత్వానికి పెద్ద దెబ్బని వ్యాఖ్యానించారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 14 Jan 2023 12:54PM

Photo Stories