Skip to main content

Tigers in India: దేశంలో పెరుగుతున్న పులుల సంఖ్య.. తాజా లెక్కలివే.. ప్రపంచంలోని మొత్తం పులుల్లో 70% భారత్‌లోనే..

ప్రపంచంలోనే పులుల సంరక్షణ అంశంలో భారత్‌ అనుసరిస్తున్న విధానాలు ప్రపంచదేశాలకు మార్గదర్శకంగా మారాయి. నాలుగేళ్లకొకసారి అభయారణ్యాలలో పులుల్ని లెక్కించే ప్రక్రియ ఆసక్తికరంగా మారి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులకెక్కింది.
Tigers in India

మన దేశంలో పులుల సంరక్షణ కోసం 50 ఏళ్ల క్రితమే టైగర్‌ ప్రాజెక్టు మొదలైంది. పర్యావరణ పరిరక్షణకు, ప్రకృతి సమతుల్యతకి పులులు ఎంత ముఖ్యమో గ్రహించిన అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం  1973, ఏప్రిల్‌ 1న ఈ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టింది. అ­ప్పట్లో దేశీయంగా అంతరించడానికి సిద్ధంగా ఉన్న జాబితాలో పులులు చేరిపోయాయి. ఇరవయ్యో శతాబ్దంలో ప్రపంచ దేశాల్లో పులుల సంఖ్య లక్ష ఉంటే, మన దేశంలో 40 వేలు ఉండేవి. అలాంటిది 1970 నాటికి పులుల సంఖ్య దాదాపుగా 1,800కు ప­డిపోవడంతో కేంద్రం అప్రమత్తమైంది. అభివృద్ధి పేరిట అడవులకి, వన్యప్రాణులకి ఎంత నష్టం జరుగుతోందో గ్రహించి టైగర్‌ ప్రాజెక్టుని ప్రారంభించింది. తొలిదశలో 18,278 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో తొమ్మిది టైగర్‌ రిజర్వ్‌లు ఉండేవి. ప్రస్తుతం 75 వేల చదరపు కిలోమీటర్లు (దేశ భౌగోళిక విస్తీర్ణంలో 2.4%) విస్తీర్ణంలో 53కి పైగా టైగర్‌ రిజర్వులున్నాయి. ప్రపంచంలో మొత్తం పులుల్లో మన దేశంలో 70% ఉన్నాయంటే ఈ టైగర్‌ ప్రాజెక్టు ఎంతటి విజయాన్ని సాధించిందో తెలుస్తోంది.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (అవార్డ్స్) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)

పులుల సంఖ్య పెరుగుతోందిలా..! 
2006 – 1,411 
2010 – 1,706 
2014 – 2,226 
2018 – 2,967 
2022 – 3,167 
పులులను ఎలా లెక్కిస్తారంటే! 
☛ దేశంలో పులుల సంరక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి వాటి గణన చేపట్టినప్పుడు అదో పెద్ద సవాల్‌గా నిలిచింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడంతో తొలినాళ్లలో అటవీ సిబ్బంది అడవుల్లో నడుచుకుంటూ వెళ్లి వన్యప్రాణులు కనిపిస్తే వాటి గుర్తులతో సహా ఎన్ని కనిపించాయో వివరాలను రాసుకొని లెక్కించేవారు.  
☛ ఆ తర్వాత పగ్‌ మార్క్‌ విధానం అమల్లోకి వచ్చింది. పులుల పాద ముద్రలనే వాటిని లెక్కించడానికి వాడేవారు. మనుషు­ల వేలిముద్రలన్నీ ఎలా ఒక్కలా ఉండవో పులుల పాద ము­ద్రలు కూడా ఒకేలా ఉండవు. అలా పాదముద్రల్ని బట్టి ఎన్ని పులులు ఉన్నాయో గుర్తించేవారు. బటర్‌ పేపర్‌పై స్కెచ్‌పెన్‌తో పాద ముద్ర ఆకారాన్ని గీస్తారు. గాజుపలకపై తెల్లటి కాగితాన్ని ఉంచి ఆకారాన్ని దానిపై పడేలా చేస్తారు. నేలపై ఉన్న ముద్రల మీద చాక్‌పౌడర్‌ చల్లి ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ మిశ్రమాన్ని కలిపేవారు. ఆ మిశ్రమం గడ్డ కట్టి పులి పాదం అచ్చు లభించేది. ఆ పాద ముద్ర ఆధారంగా ఎన్ని పులు­లు తిరిగాయి, వాటి వయసు వంటివి తెలుసుకునేవారు.  
☛ ఒక దశలో వన్యప్రాణుల గోళ్లు, మలం సేకరించి దాని ఆధారంగా కూడా గణన జరిగేది.  

Pan-Aadhaar Link: మీ ఆధార్-పాన్ లింక్ అయ్యిందా.. లేదా.. తెలుసుకోండిలా.. లింక్ చేయ‌క‌పోతే ఏమ‌వుతుందో తెలుసా..?

☛ కొన్నేళ్లు గడిచాక మరో కొత్త విధానాన్ని మొదలు పెట్టారు. పులులు చేతికి చిక్కినప్పుడు వాటిపై ప్రత్యేకమైన ముద్ర వేసేవారు. మళ్లీ వాటిని అడవుల్లో వదిలేసి ఆ తర్వాత లె­క్కించే సమయంలో ముద్ర ఉందో లేదో చూసేవారు. ము­ద్ర లేని పులులు కనిపిస్తే కొత్తగా జాబితాలో వచ్చి చేరేవి.  
☛ గత కొన్నేళ్ల నుంచి అత్యాధునిక కెమెరాలు వినియోగించి పులుల సంఖ్యని గణిస్తున్నారు. ఎక్కువగా పులులు సంచరించే ప్రాంతాలను గుర్తించి అక్కడ కెమెరాలు ఏర్పాటు చేసినట్టుగా జాతీయ పులుల సంరక్షణ అథారిటీ అధికారులు చెప్పారు. అడవుల్లో ఇరువైపులా ఉన్న చెట్లకు కెమెరాలు ఫిక్స్‌ చేయడం వల్ల పులులతో పాటు ఆయా ప్రాంతాల్లో ఉండే వన్యప్రాణుల గురించి కూడా తెలుస్తుంది. ఇక పులుల ఎత్తు, వాటి నడక, వాటి శరీరంపై ఉండే చారల ఆధారంగా సంఖ్యను తెలుసుకుంటారు.  
గిన్నిస్‌ రికార్డుల్లోకి పులుల గణన 
మన దేశంలో పులుల గణన రికార్డులు తిరగరాసింది. కెమెరాల సాయంతో భారీగా వన్యప్రాణుల గణన చేపట్టిన తొలి దేశంగా భారత్‌ గిన్నిస్‌ రికార్డులకెక్కింది. 2018–2019 పులుల గణన ప్రపంచంలోనే అత్యంత సమగ్రమైనది. 141 ప్రదేశాల్లో 26,838 చోట్ల మోషన్‌ సెన్సర్లున్న కెమెరాలు అమర్చారు. ఈ ప్రక్రియలో 44 వేల మంది అధికారులు, జీవ శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. 20 రాష్ట్రాల్లో రహస్య కెమెరాలు, ఇతర పద్ధతుల్లో పులులతో పాటు ఇతర వన్యప్రాణుల్ని లెక్కించడం రికార్డు సృష్టించింది.

Toll Plaza Charges: వాహనదారులకు షాక్.. ఏప్రిల్ ఒకటి నుంచి పెరగనున్న ‘టోల్’ చార్జీలు..!

Published date : 10 Apr 2023 03:35PM

Photo Stories