Leopard: భారత్లో చిరుత పులుల గణన
![Census of Leopards in India Leopard population in India Madhya Pradesh tops with 3,907 leopards](/sites/default/files/images/2024/03/06/leopard-1709705836.jpg)
కేంద్ర పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్.. ఫిబ్రవరి 29న భారతదేశంలో ‘చిరుతపులుల గణన’ను విడుదల చేసారు, దీని ప్రకారం–దేశంలో దాదాపు 13,874 చిరుతలు ఉన్నాయి. మధ్యప్రదేశ్లో దేశంలోనే అత్యధికంగా 3,907 చిరుతపులులు ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 569, తెలంగాణలో 297 చిరుత పులులు ఉన్నాయి. అత్యధిక చిరుతపులుల జనాభా నాగార్జున సాగర్ శ్రీశైలం(ఆంధ్రప్రదేశ్), పన్నా (మధ్యప్రదేశ్), సాత్పురా (మధ్యప్రదేశ్) టైగర్ రిజర్వ్ల్లో ఉంది. ఈ గణనను నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, వైల్డ్లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర అటవీ శాఖల సహకారంతో రూపొందించారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
![Sakshi Education Mobile App](/sites/default/files/inline-images/CAs_0.jpg)