Skip to main content

UAE అధ్యక్షుడు బిన్ జాయెద్ తో ప్రధాని మోదీ భేటీ

యూఏఈ నూతన అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 28న భేటీ అయ్యారు. అబుదాబి విమానాశ్రయంలో షేక్‌ మొహమ్మద్‌తోపాటు రాజకుటుంబానికి చెందిన సీనియర్‌ సభ్యులు మోదీకి ఘన స్వాగతం పలికారు. షేక్‌ మొహమ్మద్‌ తండ్రి, మాజీ అధ్యక్షుడు షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ మృతికి సంతాపం తెలిపారు.

Also read: G7 Summit Germany: జీ7 సమ్మిట్ లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం

పీవీకి మోదీ నివాళులు
జూన్ 28న మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. పీవీ దేశానికి చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. ‘ దేశ ప్రగతికి ఆయన చేసిన కృషికి దేశం కృతజ్ఞతలు తెలుపుతోందంటూ ట్వీట్‌ చేశారు.

Published date : 29 Jun 2022 05:47PM

Photo Stories