Skip to main content

Petrol Price: లీట‌ర్ పెట్రోల్ రూ.250

పాకిస్తాన్‌లో మరోసారి పెట్రో ధరల మోత మోగింది. లీటర్‌ పెట్రోల్, డీజిల్‌ ధరలపై రూ.35 రూపాయలు పెంచుతున్నట్టుగా పాకిస్తాన్‌ ఆర్థిక శాఖ మంత్రి ఇషక్‌ దార్‌ ప్రకటించారు.

పెట్రో ధరలు పెంచుతున్నట్టుగా ఉదయం 10:50 గంటలకు ప్రకటించిన మంత్రి మరో పది నిముషాల్లో అంటే 11 గంటల నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని చెప్పడంతో ప్రజలు అవాక్కయ్యారు. ఇక కిరోసిన్, లైట్‌ డీజిల్‌ ధరల్ని లీటర్‌కి రూ.18 పెంచారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రో ఉత్పత్తుల ధరలు 11శాతం పెరగడం, పాకిస్తాన్‌ రూపాయి మారకం విలువ పడిపోవడంతో వీటి ధరలు పెంచకతప్పడం లేదని ఇషక్‌ చెప్పారు. గత నాలుగు నెలలుగా పెట్రోల్, డీజిల్‌ పెంచని విషయాన్ని గుర్తు చేశారు.
పెట్రో ధరలు ఇలా (లీటర్‌కి) 

పెట్రోల్‌     రూ.249.80 
హై స్పీడ్‌ డీజిల్‌     రూ.262.80 
కిరోసిన్‌     రూ.189.83 
లైట్‌ డీజిల్‌ ఆయిల్‌     రూ.187 

 

Published date : 30 Jan 2023 05:57PM

Photo Stories