Skip to main content

Taliban Suicide Attac: మసీదులో తాలిబన్‌ ఆత్మాహుతి దాడి.. 61 మంది దుర్మరణం

పాకిస్తాన్‌లో తాలిబన్లు దారుణ దాడికి తెగబడ్డారు. జ‌న‌వ‌రి 30న‌ పెషావర్‌లో ప్రార్థనాల కోసం మసీదుకు చేరుకున్న వారిని లక్ష్యంగా చేసుకుని తాలిబన్‌ ఆత్మాహుతి బాంబర్‌ జరిపిన దాడిలో ఏకంగా 61 మంది ప్రాణాలు కోల్పోయారు. 157 మంది గాయపడ్డారు.

గాయపడిన వారిలో పోలీసులు, భద్రత, ఆరోగ్య సిబ్బంది ఎక్కువగా ఉన్నారు. దాడి జరిగిన మసీదు నగరంలోని పోలీస్‌ లైన్స్‌ ప్రాంత పోలీస్‌ ఆఫీస్‌ సమీపంలో ఉంది. దాంతో ఈ మసీదులో మధ్యాహ్నం ప్రార్థనల్లో ఎక్కువ మంది పోలీసు, ఆర్మీ, బాంబ్ నిర్వీర్య దళాల సభ్యులు పాల్గొన్నారు. అఫ్గాన్‌లో గత ఏడాది ఆగస్టులో తెహ్రీక్‌ ఈ తాలిబన్‌ పాకిస్తాన్‌(టీటీపీ) కమాండర్‌ ఉమర్‌ ఖలీద్‌ ఖురసానీని చంపినందుకు ప్రతీకారంగా పెషావర్‌ పేలుడు జరిపామని ఖలీద్‌ సోదరుడు ప్రకటించారు. పేలుడు ధాటికి మసీదు కొంత నేలకూలింది. ఈ శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని ఒక పోలీసు అధికారి చెప్పారు.
ఎస్పీ ఆఫీస్‌ పక్కనే ఉన్న ఈ మసీదుకు భద్రత ఎక్కువ. మసీదులో నాలుగు అంచెల భద్రత వలయం దాటుకుని మరీ ఆత్మాహుతి బాంబర్‌ లోపలికొచ్చి దాడి చేయడం గమనార్హం. దాడి సమయానికి ఆ మసీదు లోపల, బయట కలిపి మొత్తంగా 300–400 మంది పోలీసులు ఉండొచ్చని పెషావర్‌ సిటీ పోలీస్‌ ఆఫీసర్‌ ముహమ్మద్‌ ఇజాజ్‌ ఖాన్‌ చెప్పారు. దాడి ఘటనను పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ తీవ్రంగా ఖండించారు.  

Pakistan Rupee: పాక్‌ రూపాయి మరింత పతనం

Published date : 31 Jan 2023 01:35PM

Photo Stories