Skip to main content

Tiger TRIUMPH 2024: భారత్‌–యూఎస్‌ ‘టైగర్‌ ట్రయంఫ్‌’ ప్రారంభం

Indian and US combined armed forces began Exercise Tiger TRIUMPH 2024

భారత్, యూఎస్‌ మధ్య రక్షణ బంధం మరింత బలోపేతం కోసం రెండు దేశాల మధ్య నిర్వహించే ‘టైగర్‌ ట్రయంఫ్‌’ యుద్ధ విన్యాసాలకు ఈ ఏడాది విశాఖపట్నం వేదికగా నిలిచింది. తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం విశాఖపట్నంలో టైగర్‌ ట్రయంఫ్‌–2024, మార్చి 18న ప్రారంభమైంది. మార్చి 31వ తేదీ వరకు రెండు ఫేజ్‌లలో జరుగనున్న ట్రయంఫ్‌ యుద్ధ విన్యాసాల్లో ఇరు దేశాలకు చెందిన త్రివిధ దళాలు పాల్గొంటున్నాయి. ఈ మేరకు యూఎస్‌కు చెందిన యూఎస్‌ఎస్‌ సోమర్‌ సెట్‌ యుద్ధ నౌకతోపాటు ల్యాండింగ్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్లు, యూఎస్‌ మెరైన్‌ కార్ప్స్, ఎమ్మార్కెడ్‌ దళాలు విశాఖకు చేరుకున్నాయి.

ర్యాపిడ్‌ యాక్షన్‌ మెడికల్‌ టీమ్‌(ఆర్‌ఎంటీ) కూడా ఈ విన్యాసాల్లో పాల్గొననుంది. ఈ నెల 25వ తేదీ వరకు హార్బర్‌ ఫేజ్‌ విన్యాసాలు జరగనున్నాయి. ఇందులో రెండు దేశాల త్రివిధ ద­ళాల శిక్షణ సందర్శనలు, క్రీడా పోటీలు, వివిధ అంశాలపై చర్చలు ఉంటాయి. ఆ తర్వాత 26 నుంచి 31వ తేదీ వరకు సీ ఫేజ్‌ విన్యాసాలు ఉంటాయి. ఇందులో హ్యుమానిటేరియన్‌ అసిస్టెన్స్‌ అండ్‌ డిజాస్టర్‌ రిలీఫ్‌(హార్డ్‌),యుద్ధ విన్యాసాలను విశాఖ సము ద్ర తీరానికి 40 మైళ్ల దూరంలో నిర్వహించనున్నారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 30 Mar 2024 06:52PM

Photo Stories