World Health Organization: ఒకే సంవత్సరంలో 14.1 లక్షల క్యాన్సర్ కేసులు.. 9.1 లక్షల మంది మరణం..!
Sakshi Education
భారతదేశాన్ని క్యాన్సర్ మహమ్మారి కబళిస్తున్న తీరును ప్రపంచ ఆరోగ్య సంస్థ తన తాజా గణాంకాల్లో వెల్లడించింది.
![Cancer Cases Rising in India](/sites/default/files/images/2024/02/03/world-health-organization-1706943800.jpg)
ది ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ గణాంకాల ప్రకారం 2022లో భారత్లో 14.1 లక్షల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. క్యాన్సర్ కారణంగా 9.1 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
పురుషల్లో పెదవులు, నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్లు సర్వసాధారణం అయ్యాయి. రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు మహిళల్లో ఎక్కువయ్యాయి. మొత్తం కొత్త కేసుల్లో 27 శాతం బ్రెస్ట్, 18 శాతం సెర్విక్స్ యుటెరీ క్యాన్సర్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ సోకి ఐదేళ్లుగా బాధపడుతున్న వారి సంఖ్య 5.3 కోట్లకు చేరిందని నివేదికలో పేర్కొన్నారు.
Nuclear Power Plants: అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం.. 4 వేల మందికి దొరకనున్న ఉద్యోగాలు..
Published date : 03 Feb 2024 12:33PM