Skip to main content

రేస్‌ టు ఫినిషింగ్‌ లైన్‌ నివేదికను రూపొందించిన ప్రభుత్వం సంస్థ?

త్వరలోనే కరోనా మూడో వేవ్‌ వచ్చే అవకాశం ఉందని కొద్దిరోజులుగా శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Current Affairs దేశంలో మూడో వేవ్‌ ఎప్పుడు రావొచ్చు, పరిస్థితి ఎలా ఉంటుందన్న దానిపై అంచనాలు వేస్తున్నారు. ఇదే తరహాలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఐఐటీ కాన్పూర్‌ వేర్వేరుగా అధ్యయనం చేసి నివేదికలు విడుదల చేశాయి. రెండూ కూడా 2021, ఆగస్టు మధ్యలో కరోనా మూడో వేవ్‌ ప్రారంభం కావొచ్చని పేర్కొన్నాయి.

దేశంలో కరోనా పరిస్థితిపై అధ్యయనం చేసిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ‘కోవిడ్‌ 19: ది రేస్‌ టు ఫినిషింగ్‌ లైన్‌’ పేరిట జూలై 5న ఒక నివేదికను విడుదల చేసింది. ఐఐటీ కాన్పూర్‌ కూడా తాము రూపొందించిన ‘సూత్ర’ మోడల్‌తో దేశంలో కరోనా పరిస్థితిని అంచనా వేసింది.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : కోవిడ్‌ 19: ది రేస్‌ టు ఫినిషింగ్‌ లైన్‌ పేరుతో నివేదిక విడుదల
ఎప్పుడు : జూలై 5
ఎవరు : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
ఎందుకు : దేశంలో మూడో వేవ్‌ ఎప్పుడు రావొచ్చు, పరిస్థితి ఎలా ఉంటుందన్న దానిపై అంచనాలను వెల్లడించేందుకు...
Published date : 06 Jul 2021 06:27PM

Photo Stories