Skip to main content

మెడ్‌టెక్‌ జోన్‌తో ఆస్ట్రేలియా భాగస్వామ్యం

మహిళా పారిశ్రామిక వేత్తల్లో నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం ఏపీ మెడ్‌టెక్‌ జోన్, గ్లోబల్‌ ఉమెన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ (గ్వాస్‌)లతో ‘ఆస్‌బ్రిడ్జ్‌’ పేరుతో చెన్నైలోని ఆస్ట్రేలియా కాన్సులేట్‌ జనరల్‌ నూతన భాగస్వామ్యాన్ని ప్రకటించింది.
Current Affairs
సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్‌ (స్టెమ్‌)పై మహిళలు, బాలికలకు ఆసక్తి పెంపొందించడం ద్వారా వారి నైపుణ్యాన్ని పెంపొందించే వాతావరణం కల్పించడం ఆస్ట్రేలియా ప్రభుత్వం లక్ష్యమని ఆస్ట్రేలియా కాన్సులేట్‌ జనరల్‌ ఎం.ఎస్‌.సారా కిర్లేవ్‌ చెప్పారు. స్టెమ్‌లో మహిళలకు మద్దతిచ్చే విషయంలో గ్వాస్, మెడ్‌టెక్‌ జోన్‌లతో కలిసి పనిచేయడం గర్వంగా ఉందన్నారు.

దిశ డీఐజీగా రాజకుమారి...
దిశ విభాగం డీఐజీగా విజయనగరం ఎస్పీ బి.రాజకుమారి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె స్థానంలో దిశా విభాగం ఎస్పీగా పని చేస్తున్న ఎం.దీపికాను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ఏపీ మెడ్‌టెక్‌ జోన్, గ్లోబల్‌ ఉమెన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ (గ్వాస్‌)లతో భాగస్వామ్యం
ఎప్పుడు : జూలై 6
ఎవరు : చెన్నైలోని ఆస్ట్రేలియా కాన్సులేట్‌ జనరల్‌
ఎందుకు : మహిళా పారిశ్రామిక వేత్తల్లో నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం...
Published date : 07 Jul 2021 05:25PM

Photo Stories