Skip to main content

గుడికో గోమాత కార్యక్రమం ఎక్కడ ప్రారంభమైంది?

టీటీడీ, తిరుపతి హిందూ ధర్మ ప్రచార పరిషత్, ఎస్వీ గో సంరక్షణశాల ఆధ్వర్యంలో చేపట్టిన ‘గుడికో గోమాత’ కార్యక్రమం ప్రారంభమైంది.
Current Affairs

ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుతో కలిసి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి డిసెంబర్ 7న విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి ఒక గోవును అందజేశారు.

గుడికో గోమాత కార్యక్రమం-వివరాలు

  • ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని 28 దేవాలయాల్లో ‘గుడికో గోమాత’ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్టు నిర్ణయించింది.
  • హిందూ ధర్మ ప్రచార పరిషత్, టీటీడీ ఎస్వీ గోసంరక్షణశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.
  • ఏపీలోని 13 జిల్లాలు, తెలంగాణలోని పాత 10 జిల్లాల్లో... జిల్లాకు ఒక ఆలయం చొప్పున, కర్ణాటకలోని 5 దేవాలయాల్లో కలిపి మొత్తం 28 ఆలయాల్లో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమం ప్రారంభించాలని నిర్ణయించారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : గుడికో గోమాత కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 7
ఎవరు : టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఏపీ దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
ఎక్కడ : ఇంద్రకీలాద్రి, విజయవాడు, కృష్ణా జిల్లా
ఎందుకు : దేవాలయాలకు గోవులను అందజేసేందుకు
Published date : 08 Dec 2020 05:30PM

Photo Stories