Skip to main content

ఏఎఫ్‌ఆర్‌సీ చైర్మన్‌గా జస్టిస్ స్వరూప్‌రెడ్డి

తెలంగాణ ఫీజులు, ప్రవేశాల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ స్వరూప్‌రెడ్డి నియమితులయ్యారు.
ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి జూన్ 27న జీవో 98 జారీ చేశారు. అలాగే ఏఎఫ్‌ఆర్‌సీ కమిటీ ఏర్పాటుతోపాటు సభ్యులను కూడా నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2016-17 నుంచి 2018-19 వరకు ఆయనే ఏఎఫ్‌ఆర్‌సీ చైర్మన్‌గా వ్యవహరించారు. ఏఎఫ్‌ఆర్‌సీకి చైర్మన్‌ను నియమించడంతో ఇంజనీరింగ్ ఫీజుల ఖరారు వేగం కానుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
తెలంగాణ ఫీజులు, ప్రవేశాల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : జూన్ 27
ఎవరు : హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ స్వరూప్‌రెడ్డి
Published date : 28 Jun 2019 06:06PM

Photo Stories