Skip to main content

భూకంపం వచ్చినా ఇంటర్వ్యూ ఆపని ప్రధాని

న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ మరోసారి వార్తల్లోకెక్కారు. న్యూస్‌హబ్ అనే టీవీ చానెల్‌కు ఆమె మే 25న ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలోనే రాజధానిలో భూకంపం సంభవించింది.
Current Affairs
అరుునా సరే, ఏమాత్రం ఆందోళన చెందకుండా ఇంటర్వ్యూ కొనసాగించారు. పార్లమెంట్ కాంప్లెక్స్‌లో ఉన్న జెసిండా ‘మాకు ఇక్కడ స్వల్ప భూకంపం వచ్చింది. నా వెనుక కొన్ని వస్తువులు కదులుతున్నట్లుగా ఉంది. నా తలపైన లైట్లేవీ వేలాడటం లేదు. ఈ భవనం కూడా సురక్షితంగానే ఉన్నట్లుంది. మేం క్షేమంగానే ఉన్నాం. ఇదిగో ఇప్పుడు ప్రకంపనలు ఆగిపోయారుు..’అని ఇంటర్వ్యూ చేస్తున్న రియాన్ బ్రిడ్జితో అన్నారు. మే 25న సంభవించిన ఈ భూకంపంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
భూకంపం వచ్చినా ఇంటర్వ్యూ ఆపని ప్రధాని
ఎప్పుడు : మే 25
ఎవరు
: న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్
ఎక్కడ : న్యూజిలాండ్
Published date : 26 May 2020 06:25PM

Photo Stories