Gita Press: గాంధీ శాంతి బహుమతి.. రూ.కోటి నగదు బహుమతి నిరాకరించిన గీతా ప్రెస్
Sakshi Education
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఉన్న ప్రఖ్యాత గీతా ప్రెస్కు ప్రతిష్టాత్మక గాంధీ శాంతి బహుమతి ఇవ్వడంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ మండిపడ్డారు.
![Gita Press](/sites/default/files/images/2023/06/20/gita-press-1687242719.jpg)
ప్రధాని మోదీ నేతృత్వంలోని జ్యూరీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆయన హిందుత్వ భావాజాలానికి ముడిపెట్టారు. వినాయక్ దామోదర్ సావర్కర్, గాడ్సే వారసత్వానికి అవార్డు ఇస్తున్నారని ఆరోపించారు. 2015లో గీతా ప్రెస్లో రిలీజ్ అయిన, జర్నలిస్టు అక్షయ ముకుల్ రాసిన వివాదాస్పద పుస్తకాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. కాగా.. రాజకీయంగా వివాదం రేగడంతో రూ.కోటి రూపాయల నగదును గీతా ప్రెస్ నిరాకరించింది.
Prime Minister Narendra Modi: నరేంద్రమోదీకి రెండు అత్యున్నత పౌర పురస్కారాలు
Published date : 20 Jun 2023 12:01PM