Skip to main content

‘బీఈడీ’కి కాలేజీల వారీగా ఫీజులు ఖరారు

సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) కోర్సు ఫీజులను విద్యాశాఖ ఖరారు చేసింది.
తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) నిర్దేశించిన అంశాల ప్రకారం కాలేజీల వారీగా ఫీజులను ఫైనలైజ్ చేసింది. ఈ ఫీజులు 2019-20 విద్యా సంవత్సరం నుంచి 2021-22 విద్యా సంవత్సరం వరకు మూడేళ్లపాటు అమలు కానున్నాయి. కాలేజీల వారీగా నిర్దేశించిన ఫీజుల వివరాలతో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రాంచంద్రన్ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో రాష్ట్రంలోని 209 కాలేజీలకు వేరువేరుగా ఫీజులను ఖరారు చేశారు.
Published date : 02 Sep 2020 12:23PM

Photo Stories