MBBS Ranker: నీట్ విద్యార్థికి ఎమ్మెల్యే సత్కారం
పరీక్షలల్లో అత్యుత్తమ ర్యాంకును సాధించిన ఓ విద్యార్థికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అభినందనలు తెలుపుతూ తనను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇలా అన్నారు...
సాక్షి ఎడ్యుకేషన్: నీట్ ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకు సాధించి, సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు పొందిన జనగామ జిల్లా కేంద్రానికి చెందిన ప్రార్నంది అక్షయను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అభినందించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అక్షయను ఎమ్మెల్యే అభినందించి శాలువాతో సత్కరించారు.
IIT Recruitment 2023: ఐఐటీ ఇండోర్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోలు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రంలో జిల్లాకు ఒక్కటి మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడంతో ఎంబీబీఎస్ విద్యార్థులకు లోకల్గా అవకాశం వచ్చిందన్నారు. ఆయన వెంట జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్దె సిద్ధిలింగం, పార్నంది వెంకటస్వామి, నాయకులు ఉల్లుంగుల సందీప్ తదితరులు ఉన్నారు.
#Tags