Suman and Soumya: సివిల్ కానిస్టేబుళ్లుగా భార్యాభర్తల ఎంపిక
సిరికొండ: రావుట్ల గ్రామానికి చెందిన భార్యాభర్త లు మందముల సుమన్, సౌమ్య సివిల్ కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు.
మైలారం గ్రామానికి చెందిన అన్నదమ్ములు బైరగోని వాల్మీకిగౌడ్, గిరిధర్గౌడ్, పోత్నూర్ గ్రామానికి చెందిన అన్నదమ్ములు మేకల భరత్, మేకల దినేశ్లు సైతం సివిల్ కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు.
రావుట్ల నుంచి మరో ఐదుగురు, తాటిపల్లి నుంచి ఐదుగురు, చీమన్పల్లి నుంచి నలుగురు, దుప్య తండా నుంచి నలుగురు, సిరికొండ నుంచి ఒకరు, ముషీర్నగర్ నుంచి ఒకరు, కొండాపూర్ నుంచి ముగ్గురు, వర్జన్ తండా నుంచి ఒకరు, గోప్యనాయక్ తండా నుంచి ఒకరు, పాకాల నుంచా ఒకరు, మైలారం నుంచి ముగ్గరు కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. దీంతో ఆయా గ్రామాల్లో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
చదవండి:
Police Jobs 2023 : ఒకే కుటుంబం.. ఒకేసారి ముగ్గురు కానిస్టేబుల్ ఉద్యోగాలు కొట్టారిలా.. ఎక్కడంటే..
#Tags