Inter Admissions: విద్యార్థుల నమోదును పెంచాలి
నడిగూడెం : ఇంటర్ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లకు ఈనెలాఖరు వరకు అవకాశం ఉందని, విద్యార్థుల నమోదును పెంచాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి భాను నాయక్ కోరారు.
ఆగస్టు 21న నడిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన తనిఖీ చేశారు. అధ్యాపకులు, విద్యార్థుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం అధ్యాపకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధం వహించాలన్నారు.
చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2024 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్
వచ్చే వార్షిక పరీక్షల్లో 100 శాతం ఫలి తాల సాధించేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో ప్రిన్సిపాల్ విజయ నాయక్, అధ్యాపకులు జానిపాష, శ్రీధర్, కృష్ణ, మహేష్, ఈశ్వర్, వెంకటేశ్వరరావు, నాగరాజు పాల్గొన్నారు.
#Tags