ICC Players: ఐసీసీ అవార్డులో స‌త్తాచాటిన శ్రీలంక ప్లేయ‌ర్స్!

అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రతీ నెలా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పురుష‌, మ‌హిళ క్రికెట‌ర్ల‌కు 'ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్‌ది మంత్‌' అవార్డును ఇస్తుంది.

తాజాగా ఆగస్టు నెలకు గానూ ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ది మంత్‌ అవార్డు విజేతలను అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్ సెప్టెంబ‌ర్ 16వ తేదీ ప్రకటించింది. ఈ అవార్డులలో శ్రీలంక ప్లేయర్స్ సత్తాచాటారు. 

పురుషుల, మహిళల విభాగాల్లో రెండు అవార్డులు కూడా శ్రీలంకకే దక్కడం గమనార్హం. మెన్స్ కేటగిరీలో లంక యువ స్పిన్ సంచలనం దునీత్ వెల్లలాగే, మహిళల క్రికెట్‌ విభాగంలో శ్రీలంక స్టార్ బ్యాటర్ హర్షిత సమరవిక్రమ ఈ ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకున్నారు.

ఐసీసీ ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డు అందుకున్న ఐదో లంక ఆటగాడిగా దునీత్ నిలిచాడు. 
ఈ జాబితాలో ఏంజెలో మాథ్యూస్ (మే 2022), ప్రబాత్ జయసూర్య (జూలై 2022), వనిందు హసరంగా (జూన్ 2023), కమిందు మెండిస్ (మార్చి 2024) ఉన్నారు. మరోవైపు  లంక మహిళా క్రికెటర్ హర్షిత సమరవిక్రమ ఐర్లాండ్ పర్యటనలో అదరగొట్టింది.

Cristiano Ronaldo: చరిత్ర సృష్టించిన క్రిస్టియానో రొనాల్డో.. ప్రపంచంలోనే తొలి వ్యక్తిగా..

#Tags