Sunita Williams: రోదసీ యాత్ర‌కు సిద్ధ‌మైన‌ సునీతా విలియమ్స్..

భారత సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ మూడోసారి రోదసి యాత్రకు సిద్ధం అయ్యారు.

ఈస్టర్న్ డే టైమ్ (EDT) ప్రకారం ఈ నెల 17వ తేదీ సాయంత్రం 6.16 గంటలకు(భారత కాలమానం ప్రకారం 18వ తేదీ తెల్లవారుజామున 3:46 గంటలకు) ప్రయోగం నిర్వహించనున్నారు.

మే 7వ తేదీ తలపెట్టిన ఈ యాత్ర ఆగిపోయింది. సాంకేతిక కారణాల దృష్ట్యా రోదసీ యాత్ర ఆగినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఎక్స్‌ ద్వారా తెలిపింది. కాగా, మరమ్మతుల కోసం అట్లాస్-5 రాకెట్ తాత్కాలికంగా నిలిచిపోయింది. తల భాగంలో బోయింగ్ ‘స్టార్ లైనర్’ వ్యోమనౌకను అమర్చిన ఈ రాకెట్ ప్రయాణానికి సిద్ధంగా ఇప్పటివరకు ఫ్లోరిడాలో కేప్ కెనెవరాల్ ల్యాంచ్ పాడ్ మీద నిలిచివుంది.

 

 

రాకెట్ సెంటార్ అప్పర్ స్టేజిలోని ఆక్సిజన్ ప్రెజర్ రిలీఫ్ వాల్వ్ పాడైపోవటంతో ప్రయోగం చివరి నిమిషంలో వాయిదాపడింది. వాల్వును మార్చడానికి అట్లాస్-5ను వర్టికల్ ఇంటిగ్రేషన్ ఫెసిలిటీకి తరలిస్తారు.  

Herbivore Dinosaur: కొత్త డైనోసార్ జాతిని కనుగొన్న శాస్త్ర‌వేత్త‌లు..!

➤ ఈ యాత్రలో సునీతా విలియమ్స్‌తో పాటు తన సహోద్యోగి బుచ్ విల్మోర్‌తో పాల్గొంటారు.
➤ వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో వారం పాటు గడుపుతారు.
➤ ఈ యాత్ర విజయవంతమైతే ఐఎస్‌ఎస్‌కు వ్యోమగాములను చేరవేసే రెండో వ్యోమనౌక అమెరికాకు అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. 
➤ ఇప్పటివరకు ఎలన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ ఈ సేవలను అందిస్తోంది.
➤ స్టార్‌లైనర్‌తో మానవసహిత యాత్ర నిర్వహించడం మాత్రం ఇదే మొదటిసారి.

➤ సునీతా విలియమ్స్ ఇప్పటివరకు రెండుసార్లు అంతరిక్ష యాత్రలు చేశాయి. 2007లో 129 రోజులు, 2012లో 182 రోజులు అంతరిక్షంలో గడిపారు.

Operation Meghdoot: ‘ఆపరేషన్‌ మేఘదూత్‌’కు 40 సంవత్సరాలు పూర్తి!!

#Tags