Andhra Pradesh: ప్రభుత్వం ప్రారంభించిన ఏపీ సేవ 2.0 పోర్టల్‌ ఉద్దేశం?

గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను మరింత మెరుగు పరుస్తూ ప్రజలకు వేగంగా సేవలందించేందుకు ఉద్దేశించిన ‘‘ఏపీ సేవ 2.0 పోర్టల్‌’’(ఏపీ సిటిజన్‌ సర్వీసెస్‌ పోర్టల్‌)ను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. జనవరి 27న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ పోర్టల్‌ను ప్రారంభించారు. అనంతరం సీఎం ప్రసంగిస్తూ.. ఇవాళ ప్రారంభించిన సిటిజన్‌ సర్వీసెస్‌ పోర్టల్‌ (సీఎస్‌పీ)ను పలకడానికి అనువుగా ఏపీ సేవ అంటున్నామని చెప్పారు. దీని వల్ల మారుమూల గ్రామాల్లో కూడా వేగంగా, పారదర్శకంగా, జవాబుదారీతనం పెంచే విధంగా.. మనకున్న వ్యవస్థను మెరుగు పరుస్తున్నామన్నారు.

సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

  • కొత్త సాఫ్ట్‌వేర్‌ ద్వారా అందించే విస్తృత సేవల వల్ల ప్రజలు తమకు అవసరమైన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. పారదర్శకత పెరిగి అవినీతి దూరం అవుతుంది.
  • ప్రజలు వారి దరఖాస్తును ట్రాక్‌ చేసుకునే (ఏ దశలో ఉందో చూసుకునే) వెసులుబాటు ఉంటుంది. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయం సాధ్యపడుతుంది.
  • ఏపీ సేవ పోర్టల్‌ ద్వారా రెవిన్యూ, భూ పరిపాలనకు సంబంధించిన దాదాపు 35 రకాల సేవలను కూడా తీసుకు వచ్చాం.
  • దరఖాస్తుదారుడు తమ సమీపంలోని సచివాలయంలోనే కాకుండా.. ఎక్కడి నుంచైనా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. ఒకచోట దరఖాస్తు చేస్తే.. వేరే చోట నుంచి కూడా సర్టిఫికెట్‌ పొందవచ్చు.

చ‌ద‌వండి: వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఏపీ సేవ 2.0 పోర్టల్‌(ఏపీ సిటిజన్‌ సర్వీసెస్‌ పోర్టల్‌) ప్రారంభం
ఎప్పుడు : జనవరి 27
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 
ఎక్కడ    : సీఎం క్యాంపు కార్యాలయం, తాడేపల్లి, గుంటూరు జిల్లా
ఎందుకు : గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను మరింత మెరుగు పరుస్తూ ప్రజలకు వేగంగా సేవలందించేందుకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

#Tags