Ajay Kumar Bhalla: కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌కు డీఓపీటీ అదనపు బాధ్యతలు

కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్‌ భల్లాకు భారత ప్రభుత్వ సిబ్బంది వ్యవహారాలు, శిక్షణశాఖ (డీఓపీటీ) కార్యదర్శి పదవిని అదనంగా అప్పగించారు.

దీనికి సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ప్రస్తుతం డీఓపీటీ కార్యదర్శిగా ఉన్న రాధాచౌహాన్‌ పదవీ విరమణ చేస్తుండటంతో అజయ్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి బాధ్యతలను ఆహారం, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ కార్యదర్శి సంజీవ్‌ చోప్డాకు అదనంగా అప్పగించారు. వ్యవసాయశాఖకు మ‌రో కార్యదర్శి నియమితులు అయ్యే వరకు ఆయన ఈ బాధ్యతలు నిర్వహిస్తారు. 

అలాగే.. జాతీయ మైనార్టీల కమిషన్‌ కార్యదర్శిగా కతికితల శ్రీనివాస్‌కు అదనపు బాధ్యతలు స్వీక‌రించారు. ప్రస్తుతం ఈ స్థానంలో ఉన్న అంజలి భావ్ర పదవీ విరమణ చేశారు.

Indian Army: చరిత్రలో మొదటిసారి ఆర్మీ, నేవీ చీఫ్‌లుగా క్లాస్‌మేట్స్

#Tags