Nirab Kumar Prasad: ఏపీ కొత్త సీఎస్‌గా నీరబ్‌కుమార్‌ ప్రసాద్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్‌ను రాష్ట్ర కొత్త ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా నియమించింది.

ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ జవహర్‌రెడ్డి బదిలీ కావ‌డంతో.. ఆయ‌న‌ స్థానంలో నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు చేపట్టనున్నారు. 

నీరబ్ కుమార్ ప్రసాద్ 1987 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. ప్రస్తుతం ఆయన అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

First Woman President: తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైన క్లాడియా షీన్‌బామ్.. ఏ దేశానికంటే..?

#Tags