Southampton University Campus : గురుగ్రామ్‌లో సౌతాంప్టన్‌ వర్సిటీ క్యాంపస్‌ ఏర్పాటు..

నూతన జాతీయ విద్యా విధానం కింద తొలి విదేశీ విశ్వవిద్యాలయం ఆఫ్‌షోర్‌ క్యాంపస్‌ గురుగ్రామ్‌లో ఏర్పాటు కాబోతున్నది. బ్రిటన్‌కు చెందిన సౌతాంప్టన్‌ వర్సిటీ దీనిని ఏర్పాటు చేస్తుందని కేంద్రం ఆగస్ట్‌ 29న తెలిపింది. దీనికి సంబంధించిన లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ని విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఈ వర్సిటీ ప్రతినిధులకు అందజేశారు. 

MakeMyTrip Report: గణనీయంగా పెరుగుతున్న.. విదేశాల్లో పర్యటించే భారతీయుల సంఖ్య

భారత్‌లోని క్యాంపస్‌ అందించే డిగ్రీలు బ్రిటన్‌ వర్సిటీ డిగ్రీలతో సమానంగా ఉంటాయని యూజీసీ ఛైర్మన్‌ జగదీశ్‌ కుమార్‌ తెలిపారు. ‘సౌతాంప్టన్‌ భారత్‌ క్యాంపస్‌లో జులై 2025 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. మొదట బిజినెస్, మేనేజ్‌మెంట్, కంప్యూటింగ్, లా, ఇంజినీరింగ్, ఆర్ట్, డిజైన్, బయో సైన్సెస్, లైఫ్‌ సైన్సెస్‌ కోర్సులు అందుబాటులోకి వస్తాయి.

#Tags