BRICS: బ్రిక్స్లో మరో 5 దేశాలకు సభ్యత్వం
ప్రపంచ వ్యవహారాల్లో పశ్చిమ దేశాల ఆధిపత్యం నేపథ్యంలో.. తన వ్యూహాత్మక ఎత్తుగడలను విస్తరించుకోవడంలో భాగంగా అయిదు దేశాలను పూర్తికాల సభ్యులుగా చేర్చుకున్నట్లు బ్రిక్స్ ప్రకటించింది. ప్రస్తుతం బ్రిక్స్కు నాయకత్వం వహిస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్ , సౌదీ అరేబియా, యూఏఈలను కొత్త సభ్యులుగా చేర్చుకొన్నామని తెలిపారు. జనవరి 1, 2024 నుంచి వీరి సభ్యత్వం అమల్లోకి వచ్చింది.
చదవండి: Lakshadweep History: లక్షద్వీప్పై పాకిస్తాన్ కన్ను.. లక్షద్వీప్ భారత్లో ఎలా భాగమైందంటే..
#Tags