Helping: రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడితే.. ఎంత మొత్తాన్ని అందించనున్నారు?

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి ప్రాణాలను కాపాడే వారిని ప్రోత్సహిం చేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకంతో ముందుకొచ్చింది. క్షతగాత్రులను మొదటి గంటలోగా (గోల్డెన్‌ అవర్‌) ఆస్పత్రికి తరలించిన వారికి రూ. 5 వేల ప్రోత్సాహక బహుమతి అందించనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం 2021 అక్టోబర్‌ 15 నుంచి అందుబాటులోకి వచ్చి, 2026 మార్చి 31 వరకు కొనసాగుతుందని వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల రవాణా శాఖలకు అక్టోబర్‌ 4న సమాచారం పంపింది.

జాతీయ అవార్డు అందజేత...

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి ప్రాణాలను కాపాడిన వారికి రూ. 5 వేల ప్రోత్సాహకంతో పాటు అభినందన సర్టిఫికెట్‌ను అందించనున్నట్లు కేంద్రం తెలిపింది. అత్యంత విలువైన సాయం అందించిన వారి నుంచి కొంత మందిని ఎంపిక చేసి ఏడాదికోసారి జాతీయ స్థాయి అవార్డులను ప్రకటించనున్నట్లు పేర్కొంది. వారికి రూ. లక్ష చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపింది. ఒకరి కంటే ఎక్కువ మంది బాధితులను, ఒకరి కంటే ఎక్కువ మంది కాపాడితే ఒక్కొక్కరికి రూ. 5 వేల చొప్పున ఇవ్వనున్నట్లు వివరించింది.

చ‌ద‌వండి: ఇంగ్లిష్‌ పద్య కావ్యం సారంగధరను ఎవరు రచించారు?


క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను మొదటి గంటలోగా (గోల్డెన్‌ అవర్‌) ఆస్పత్రికి తరలించిన వారికి రూ. 5 వేల ప్రోత్సాహక బహుమతి అందజేత
ఎప్పుడు : అక్టోబర్‌ 4
ఎవరు    : భారత ప్రభుత్వం
ఎక్కడ    : దేశ వ్యాప్తంగా...
ఎందుకు : రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి ప్రాణాలను కాపాడే వారిని ప్రోత్సహించేందుకు...

 

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌


డౌన్‌లోడ్‌ వయా ఆపిల్‌ ఐ స్టోర్‌

#Tags