Students Preparation Test : స‌ర్కారు విద్యార్థుల్లో సామ‌ర్థ్య‌న్ని వెలికితీసే ప‌రీక్ష‌.. రేప‌టి నుంచి..

సాక్షి ఎడ్యుకేష‌న్: విద్యార్థుల‌కు బోర్డులో నిర్వహించే ప‌రీక్ష వారికి అర్థమ‌య్యేలా ముందే నిర్వ‌హించి వారి సామ‌ర్థ్యాన్ని అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లోని ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థులకు రేప‌టి నుంచి 17వ తేదీ వ‌ర‌కు సామ‌ర్థ్య ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు పాఠశాల యాజ‌మాన్యం. దీంతో ప‌దో త‌ర‌గ‌తిలో విద్యార్థుల‌కు జ‌రిగే పబ్లిక్ ఎగ్జామ్స్‌కు సిద్ధ‌మైన‌ట్టు, అవ‌గాహ‌న పెంచిన‌ట్టు ఉంటుంది.

Engineering Admissions : యూనివర్సిటీల్లోనే విద్యార్థుల ప్ర‌వేశాలు.. మ‌రి స‌ర్కారు కాలేజీలు!

అంతేకాకుండా, విద్యార్థుల‌కు ఎంత‌వ‌ర‌కు శిక్ష‌ణ‌ను ఇవ్వాలి అనే అంచ‌నా ఉపాధ్యాయుల‌కు ఉంటుంది. ఈ నేప‌థ్యంలో సర్కారు బ‌డుల్లోని దాదాపు 83 వేల మంది విద్యార్థులకు వ‌చ్చే ఏడాది ఇంగ్లీష్ మీడియంలో ప‌బ్లిక్ ప‌రీక్ష‌కు సిద్ధం చేస్తోంది స‌ర్కార్‌. ఈ ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థులు ఆరో త‌ర‌గ‌తిలో ఉన్న స‌మ‌యంలో అప్ప‌టి ప్ర‌భుత్వ ఇంగ్లీష్ మీడియం తీసుకోచ్చింది.

#Tags