Inspiring: చదువుకున్న పాఠశాలకు రూ.2.20 లక్షల విరాళం!
పాఠశాలకు రూ.2.20 లక్షల విరాళం.
పి.గన్నవరం: స్థానిక శింగంశెట్టి ప్రభావతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలకు సోమవారం రూ.2.20 లక్షల విరాళం అందజేశారు.
ఈ సొమ్మును డిపాజిట్ చేసి, దానిపై వచ్చే వడ్డీతో ఏటా పదో తరగతి పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించాలని ప్రధానోపాధ్యాయుడు డీఎస్వీ ప్రసాద్ను వారు కోరారు. విరాళం అందించిన 1983–84 బ్యాచ్ విద్యార్థులు మానేపల్లి వెంకటేశ్వరరావు, చింతపల్లి సుజాత (జీహెచ్ఎం), పాకా వలంటీనా, యర్రంశెట్టి సూరిబాబు, అడబాల అలివేలు, ఒరిగొండ పద్మావతి, అయ్యగారి కమల తదితరులను పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ గూటం శ్రీనివాసరావు, హెచ్ఎం ప్రసాద్ అభినందించారు.
Inspirational Story: అమ్మ కోసం తాజ్మహల్ కట్టించిన కొడుకు.. ఫిదా అవుతున్న జనం!
#Tags