Entrance Test: 10న గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్ష

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఐదు, ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఈ నెల 10న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఆ విద్యాలయం కోఆర్డినేటర్‌ ఎన్‌.బాలాజీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే హాల్‌ టికెట్లను విడుదల చేశామని పేర్కొన్నారు. జిల్లాలో 5వ తరగతిలో 640 సీట్లకు గాను 1674 మంది విద్యార్థులు, ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరంలో 800 సీట్లకు గాను 1479 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. 5వ తరగతి వారికి ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, ఇంటర్‌ 2 నుంచి 4.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. హాల్‌ టికెట్లు http:a pbragcet.apcfss.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, విద్యార్థులు హాల్‌ టికెట్లతో పాటు ఆధార్‌ కార్డు, బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్‌ తీసుకురావాలని సూచించారు. వివరాలకు 7569788629, 9701736862 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

#Tags