Govt Primary School : ఒక‌టి నుంచి ఐదో త‌ర‌గ‌తి వ‌ర‌కు ప్ర‌భుత్వ ప్రాథ‌మిక పాఠ‌శాల‌ల్లోనే..!

గుంటూరు: ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోనే నిర్వహించేలా చర్యలు చేపట్టాలని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.ఆదిలక్ష్మి, ఎం.కళాధర్‌ డిమాండ్‌ చేశారు. యూటీఎఫ్‌ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గురువారం యూటీఎఫ్‌ జిల్లా శాఖ ప్రతినిధులు డీఈఓ పి.శైలజను కార్యాలయంలో కలిసి విద్యారంగ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు.

Job Mela: ఈనెల 30న జాబ్‌మేళా.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో ఉద్యోగం

రాష్ట్రవ్యాప్తంగా ఒకే సిలబస్‌, ఒకే పరీక్షా విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలను వివరించారు. డీఈఓను కలిసిన వారిలో యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్‌ ఎం.హనుమంతరావు, జిల్లా కోశాధికారి ఎండీ గయాసుద్దౌలా, జిల్లా కౌన్సిలర్లు ఎండీ షకీలా బేగం, పి.శ్రీనివాసరావు ఉన్నారు.

#Tags