ఘ‌నంగా అత్తాపూర్ భాష్యం స్కూల్ 10వ వార్షికోత్సవం..

సాక్షి ఎడ్యుకేష‌న్ : అత్తాపూర్ భాష్యం స్కూల్ 10వ వార్షికోత్సవ వేడుక మార్చి 11వ తేదీన (శ‌నివారం) ఘ‌నంగా జ‌రిగింది.
attapur bhashyam school 10th anniversary celebrations

ఈ సంద‌ర్భంగా విద్యార్థులకు ప‌లు సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ ఆర్ నాగేశ్వ‌రావు పాల్గొన్ని.. విద్యార్థుల ప్ర‌తిభ‌ను ప్ర‌సంసించారు. అలాగే  భాష్యం స్కూల్స్ విద్యాసంస్థ‌లు.. విద్యార్థుల ప్ర‌గ‌తికి ఎల్ల‌ప్పుడు బాస‌ట‌గా నిలుస్తోంద‌న్నారు. విద్యార్థులు కేరీర్‌లో స‌క్సెస్ అవ్వ‌లంటే.. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో కూడిన విద్య ఎంతో అవ‌సర‌మ‌న్నారు. అలాగే ప్ర‌తి విద్యార్థి జీవితంలో గురువుల‌కు ప్ర‌త్యేక స్థానం ఇవ్వ‌ల‌న్నారు. 

ఈ కార్య‌క్ర‌మాన్ని గౌర‌వ అతిథిలుగా విచ్చేసిన భాష్యం విద్య‌సంస్థ‌ల‌ సీఈఓ చైత‌న్య, ZEO అంక‌మ్మ‌రావు మాట్లాడుతూ.. నేటి పోటీయుగంలో విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో ప్ర‌తిభ చూపాలన్నారు. అలాగే ఈ కార్యక్ర‌మంలో అత్తాపూర్ భాస్యం స్కూల్ ప్రిన్సిపాల్ అయూబ్ బాషా, వైస్ ప్రిన్సిపాల్ లౌక్య పాల్గొన్ని విద్యార్థుల‌కు అమూల్య‌మైన సందేశాన్ని ఇచ్చారు.

#Tags