Skip to main content

TS Inter Year Results : ఇంటర్ ఫ‌లితాలు విడుద‌ల‌.. రిజ‌ల్ట్స్‌ డైరెక్ట్ లింక్ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ఇంటర్‌ ఫస్ట్, సెకండియర్‌ ఫలితాలను జూన్ 28వ తేదీన విడుద‌ల చేశారు.
TS Inter Results
TS Inter Results 2022 Released

ఈ ఫ‌లితాల‌ను ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డ్ కార్యాల‌యంలో విడుద‌ల చేశారు. ఎట్ట‌కేల‌కు గత కొన్ని రోజులుగా నెలకొన్న సస్పెన్స్‌కు తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డ్ తెరదించింది. మే 6వ తేదీన‌ మొదలైన ఇంటర్మీడియెట్‌ పరీక్షలు మే 24న ముగిసిన విష‌యం తెల్సిందే. తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాల‌ను సాక్షిఎడ్యుకేషన్‌.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు.

మొదటి స్థానంలో..

ఈ ఏడాది ఫలితాల్లో విద్యార్థులు ఫస్టియర్‌లో 63.32 శాతం, సెకండ్‌ ఇయర్‌లో 67.16 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది ఫలితాల్లో అ‍మ్మాయిలు సత్తా చాటారు. కాగా, ఆగస్టు 1వ తేదీ నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను నిర‍్వహించనున్నారు. ఫస్టియర్‌ ఫలితాల్లో మేడ్చల్‌ జిల్లా మొదటి స్థానంలో, హన్మకొండ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. 

How to Check TS Inter 1st Year 2022 Results:

➤ Visit results.sakshieducation.com or education.sakshi.com

➤ Click on TS Inter 1st year results - General / Vocational on the home page

➤ In the next page, enter your hall ticket number and submit

➤ The results will be displayed on the screen.

➤ Save a copy of the marks sheet for further reference.

How to check TS Inter 2022 Results:

➤ Visit results.sakshieducation.com or education.sakshi.com

➤ Click on TS Inter 2nd year results - General / Vocational on the home page

➤ In the next page, enter your hall ticket number and submit

➤ The results will be displayed on the screen.

➤ Save a copy of the marks sheet for further reference.

ఈ సారి ఫ‌లితాల కోసం 9,07,396 మంది విద్యార్థులు..
ఈ సారి ఇంట‌ర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 9,07,396 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంట‌ర్‌ సెకండియ‌ర్‌ విద్యార్థులు 4,42,768 మంది ఉన్నారు. అలాగే ఈ సారి 1,443 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.  25,530 మంది ఇన్విజిలేటర్లను, 150 మందితో సిట్టింగ్‌ స్క్వాడ్, మరో 75 మందితో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ల‌ను ఏర్పాటు చేసి ప‌టిష్టంగా ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించారు. అలాగే ఇంట‌ర్ ఫస్టియర్ ప‌రీక్ష‌ల‌కు 4,64,626 మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు.

ఫ‌లితాల ఆల‌స్యంకు కార‌ణం ఇదే..?
ఇంట‌ర్ ఫ‌లితాల‌ను జూన్ 20వ తేదీ నాటికే ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. అందుకు తగ్గట్టుగానే మూల్యాంకనం పూర్తి చేశారు. అయితే, కొన్ని జిల్లాల్లో మార్కుల క్రోడీకరణలో సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు తెలిసింది. కొంతమంది విద్యార్థులకు తక్కువ మార్కులు రావడంతో సమాధాన పత్రాలను అనేక సార్లు క్షుణ్ణంగా పరిశీలించినట్టు తెలిసింది. చివరకు జూన్‌ 25న ఫలితాల వెల్లడికి రంగం సిద్ధం చేశారు. కానీ ప్రభుత్వ కాలేజీల్లో ఫలితాలు తగ్గడంపై ప్రభుత్వం కొంత ఆలోచనలో పడ్డట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేలా ప్రభుత్వ స్థాయిలో కొన్ని సూచనలు చేసినట్టు సమాచారం. ఈ కారణంగా ఫలితాల వెల్లడి ఆలస్యమైనట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. గ‌తంలో జ‌రిగిన అనుభ‌వాల‌ను దృష్టితో పెట్టుకొని.., ఈ సారి ఎటువంటి స‌మ‌స్య‌లు రాకుండా ముందు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. అలాగే ఇంట‌ర్ ఫ‌లితాల‌పై వివరాలన్నీ తెలుసుకున్న మంత్రి ఆలస్యమైనా పర్వాలేదని, అన్నీ పరిశీలించిన తర్వాతే ఫలితాల విడుదలకు సిద్ధమవ్వాలని అధికారులకు సలహా ఇచ్చినట్టు తెలిసింది. 

తేడా వస్తే..
ఇప్పుడు కూడా కోవిడ్‌ తీవ్రత మధ్యే విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలు రాశారు. ఇలాంటి సమయంలో పొరపాట్లు దొర్లి ఉత్తీర్ణతలో తేడా వస్తే విద్యార్థులు తీవ్ర ఆందోళనకు దిగే అవకాశం ఉందని అధికారులకు మంత్రి సూచించినట్టు తెలిసింది. నిశితంగా పరిశీలించి అన్నీ బాగున్నాయని నిర్థారించుకున్నాకే ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు.

ఈ సారి 70 శాతం సిలబస్ నుంచే..
గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా కరోనాతో విద్యా సంవత్సరంలో ఒడిదొడుకులు చోటుచేసుకున్న విష‌యం తెల్సిందే. అలాగే ఇంటర్‌ పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్‌ చేశారు. అలాగే ఈ సారి ఇంటర్ ప‌రీక్ష‌ల ప్ర‌శ్న‌ప‌త్రాల‌ను 70 శాతం సిలబస్ నుంచి మాత్రమే ఇచ్చారు.

టీఎస్ ఇంటర్ ఫ‌లితాల స‌మ‌గ్ర స‌మాచారం మీకోసం..

Published date : 28 Jun 2022 12:22PM
PDF

Photo Stories