Skip to main content

వుయ్ లవ్ రీడింగ్: విద్యార్థుల్లో పఠనాసక్తి పెంపునకు చర్యలు..!

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థుల్లో పఠన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు విద్యాశాఖ ‘వుయ్ లవ్ రీడింగ్’ పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది.
అసర్ డేటా ప్రకారం 3వ తరగతి విద్యార్థుల్లో 77.6%, 5వ తరగతి విద్యార్థుల్లో 52.2% రెండో తరగతి పాఠ్యపుస్తకాలను చదవలేకపోతున్నట్లు తేలింది. అలాగే మూడో తరగతి విద్యార్థుల్లో 78.9% మంది ఒకటో తరగతి పుస్తకాలను చదవలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో వారిలో పఠనాసక్తిని పెంపొందించేందుకు ‘వుయ్ లవ్ రీడింగ్’ అనే పేరుతో ఈ నెల 14 నుంచి ఏడాది పాటు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 3 నుంచి 9వ తరగతి విద్యార్థులు లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడతారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులను భాగస్వాములను చేయనున్నారు. వారికి అవసరమైన శిక్షణ ఇస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
Published date : 13 Nov 2020 04:00PM

Photo Stories