Skip to main content

ఈ విద్యాసంవత్సరం నుంచి ట్రిపుల్‌ఐటీలో కొత్త కోరు ప్రారంభం

రాయదుర్గం (హైదరాబాద్‌): ప్రొడక్ట్‌ డిజైన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ళ కాలపరిమితి తో కూడిన కొత్త ఎంటెక్‌ కోర్సును ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌ మంగళవారం ప్రకటించింది.
ఈ ఎంటెక్‌ కోర్సును ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనుంది. ప్రొడక్ట్‌ మేనేజర్లకు టెక్‌ ప్రొడక్ట్‌ కంపెనీలపై మరింత అవగాహన పెంచేందుకు, స్టార్టప్‌ వ్యవస్థాపకులను పెంచేందుకు దోహదం చేసేలా ఈ కొత్తకోర్సును రూపొందించారు. యువ ఐటీ నిపుణులు, ఏడాదికి పైగా ఐటీ అనుభవంతో ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌ పీజీఈఈ లేదా సీఈఈడీ పరీక్షల ద్వారా అడ్మిషన్లు కల్పిస్తారు. అంతేకాకుండా నిబంధనలకు అనుగుణంగా స్టార్టప్, ఇండస్ట్రీలకు చెందిన వారికి కూడా అవకాశం కలి్పంచనున్నారు.
Published date : 24 Mar 2021 04:41PM

Photo Stories