Skip to main content

హోమియోపతి సీట్ల భర్తీకి తుది విడత కౌన్సెలింగ్

సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ హోమియోపతి కళాశాలల్లో బీహెచ్ఎంఎస్ కోర్సులో ప్రవేశాలకు తుది విడత కౌన్సెలింగ్కు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హులైన అభ్యర్థులు ఈ నెల 9న ఉస్మానియా క్యాంపస్‌లోని ప్రొఫెసర్‌ జి.రాంరెడ్డి సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్ఎడ్యుకేషన్ (పీజీఆర్‌ఆర్‌సీడీఈ) వద్ద ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని సూచించింది. వివరాలకు www.knruhs.telangana.gov.in వెబ్‌సైట్‌ చూడాలని పేర్కొంది.
Published date : 08 Mar 2021 03:34PM

Photo Stories